online marketing

Tuesday, October 9, 2012

సైకో కత్తితో వీరంగం...

చేజర్ల: చేజర్లలోని స్థానిక బస్టాండు సెంటరు వద్ద సైకోగా మారిన మొద్దు వెంకట రమణయ్య కత్తితో వీరంగం సృష్టించడంతో ఇద్దరు యువకులు గాయాల బారినపడి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మొద్దు వెంకట రమణయ్య గత కొంతకాలంగా చేజర్ల బస్టాండు సెంటరువద్దగల దుకాణాల సెంటర్లో చిన్నచిన్న పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం డబ్బులు విషయంలో జరిగిన చిన్న ఘర్ణణతో అతను సైకోగామారి ఆదివారం ఉదయం కత్తితో అహ్మద్‌బాషా, రియాజ్‌ అనే యువకులపెై దాడిచేసి గొంతుపెై గాయపరిచాడు. అతని సమీపంలోని మరొక యువకుడు రియాజ్‌ మోచేతిపెై గాయపరిచాడు. 

బస్టాండు సెంటరు వద్ద రిక్షాతోలుకుంటూ జీవనం గడుపుతున్న అహ్మద్‌బాషాకు తీవ్ర రక్తస్రావం కావడంతో వీరిద్దరిని 108సాయంతో వెైద్యచికిత్సలకోసం నెల్లూరు ప్రభుత్వ వెైద్యశాలకు తరలిం చారు. సైకోగామారిన మొద్దు రమణయ్య బస్టాండు సెంటరు వద్ద వీరంగం సృష్టిస్తూ దగ్గరికి వెళ్లినవారిపెై దాడిచేయడం మొదలుపెట్టాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన హెడ్‌ కానిస్టేబుల్‌ పరంధామయ్యపెై సైతం ఆ సైకో దాడికి దిగడంతో అతను తృటిలో ప్రమాదంనుండి తప్పించుకు న్నాడు. బస్టాండులోని ప్రజలు అతని వద్దకు వెళ్లాలంటే భయాందోళనలకు గురయ్యారు. అందరూ కలసి సమిష్టిగా అతన్ని పట్టుకొని అతనివద్ద నుండి కత్తిని తీసివేసి పోలీస్‌ సిబ్బంది సహకారంతో పోలీస్టేషన్‌లో అప్పగించడం జరిగింది. 

అయితే ఇతడు గతంలో ఆదురుపల్లి సెంటరు వద్ద ఒక మహిళ చెవిని కోయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని గ్రామం నుండి తరిమివేయడం జరిగింది. ఇతను చేజర్ల మండలం పెళ్లేరు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. ఇతను ఏ గ్రామంలోవున్నా అక్కడ ఏదోఒక గొడవచేసి పలువురుని గాయపరచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. చేజర్ల బస్టాండు వద్ద జరిగిన సంఘటనతో ప్రజలు సైకో ప్రవర్తనపెై భయాందోళనలు చెందుతూ బిక్కుబిక్కుమంటున్నారు. ఇతను బయట సంచరిస్తే అనేకమందిని గాయపరచి ప్రాణాలు తీసే ప్రమాదంవుందని గ్రామస్తులు తెలుపుతు న్నారు. స్థానిక ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌ సైకోను అదుపులోకి తీసుకొని అతనిపెై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లుగా ఆయన తెలిపారు. 

ప్రజల సహకారంతో ఇటువంటి వ్యక్తులను అదుపుచేయడం జరుగుతుందన్నారు. ఎవరెైనా అనుమానిత వ్యక్తులుగా సంచరిస్తుంటే పోలీస్టేషన్‌లో సమాచారాన్ని అందించాలన్నారు. ఇటువంటి వారిపెై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ పరంధామయ్య, కానిస్టేబుల్‌ రఫిలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh