online marketing

Monday, May 7, 2012

మద్యం సేవించి భార్యను మానసికంగా , శారీరకంగా ..

నెల్లూరు : భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. నాల్గవ నగర ఎస్ఐ మల్లికార్జున కథనం ప్రకారం... సర్వేపల్లి కాలువ గట్టుపై నివాసం ఉంటున్న శీనివాసులు బేల్దారి మేస్త్రిగా పని చేస్తున్నాడు. భార్య ప్రశాంతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రతి రోజు శీనివాసులు రాత్రి పూట మద్యం సేవించి భార్యను మానసికంగా , శారీరకంగా హింసించేవాడు. ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించిన శీనివాసులును ప్రశాంతి మందలించింది. దీనితో ఘర్షణ పడి ప్రశాంతిపై దాడి చేశారు. మనస్తాపానికి గురైన ప్రశాంతి ఇంట్లో ఉన్న గుళికల మందు తాగింది.స్థానికులు 108 కి సమాచారం అందించారు. ప్రశాంతిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh