online marketing

Monday, May 7, 2012

చాట్ల హేమలత ఉద్యో గం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు..

నెల్లూరు: సమస్యలు చెప్పుకునేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులను తిడితే ఎలాగని పోలీసులను ఎస్పీ మందలించారు. సైదాపురం మండలం పొక్కెందుల గ్రామానికి చెందిన బారతమ్మ తన ఇంట్లో ఉన్న 12 సవర్ల బంగారు నగలు అదే గ్రామానికి చెందిన చెఱుకూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చోరీ చేశాడని సైదాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ ఏమి పట్టించుకోకుండా బాధితురాలిని బూతులు తిట్టి పోలీసు స్టేషన్‌కు రావద్దని ఆగ్రహించాడు. ఈ విషయంపై సోమవారంగ్రీవెన్స్‌డే సందర్భంగా బాధిత మహిళ ఎస్పీ బీవీ రమణకుమార్‌ను కలసి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకుంది. దీంతో ఎస్పీ పైవిధంగా స్పందించారు.

నమ్మించి మోసం చేశారు. గ్రామం నుంచి ప్రతి రోజు నెల్లూరుకు వచ్చి చదువుకుంటున్నాను. చాకలివీధిలో ఇన్‌టర్‌నెట్ నడుపుతున్న హరి నాకు పరిచయమయ్యాడు. ఉద్యో గం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు. నాకు న్యాయం చేయండి. - చాట్ల హేమలత, పల్లిపాడు నాపై దాడి చేశారు..
భర్తతో కలసి పొగతోటలోని ఓ వైద్యశాలకు వచ్చా. పాత కక్షలు మనసులో పెట్టుకుని మరిది, మామ షరీఫ్, మరిది భార్య మరి కొంతమంది కలసి రోడ్డుపై నన్ను కొట్టారు. న్యాయం చేయండి. - రుబేదా, మన్‌సూర్‌నగర్
అశ్లీల పోస్టర్లను తొలగించండి.. నగరంలో పలుచోట్ల గోడలు, ఆటోలు, ద్విచక్రవాహనాలపై అశ్లీకరంగా ఉండే బొమ్మలు వేసుకుని తిరుగుతున్నారు. వీటి వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటిని తొలగించండి. - ముస్లిం పెద్దలు, నెల్లూరు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh