online marketing

Friday, April 6, 2012

వైఎస్‌ఆర్‌సి పార్టీలో అంబటి స్థానం ‘పుట్టింటోళ్లు తరిమేశారు... కట్టుకున్నోడు వదిలేశాడు’--వివేకా


నెల్లూరు : నెల్లూరు 80 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తమ కుటుంబాన్ని విమర్శించే అర్హత అంబటి రాంబాబుకు లేదని రూరల్‌ ఎమ్మెల్యే వివేకా పేర్కొన్నారు. శుక్రవారం వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సి పార్టీ నాయకుడు జగన్‌ రూ.లక్ష కోట్లు దోచుకున్నాడని, డెకాయిట్‌ అని ఆయన విమర్శించారు. ఆయన విసిరేసిన ఎంగిలి మెతుకులు తిని వంద కోట్లు సంపాదించాడని అంబటిని దుయ్యబట్టారు. గత 35 ఏళ్లుగా వైఎస్‌ వెంట వున్న సీనియర్లను వదిలేసి నేడు జగన్‌ పాట పాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

నెల్లూరు జిల్లా ప్రజలు తమ వెంటే ఉన్నారని, ప్రజలే మాకు బంధువులని, వారే మమ్ములను ఆదరించారని ఆయన తెలిపారు. దండకాల రాయుళ్లు ఇకనైనా నీతిగా బతకాలని ఆయన ఎద్దేవా చేశారు. ఎంఆర్‌ ప్రాపర్టీ కేసులో జగన్‌ ఎ-1 ముద్దాయి అని, త్వరలో మీ నాయకుడు జైలుకు వెళ్లక తప్పదని ఆయన తెలిపారు. వైఎస్‌ఆర్‌సి పార్టీలో అంబటి స్థానం ‘పుట్టింటోళ్లు తరిమేశారు... కట్టుకున్నోడు వదిలేశాడు’ అనే చందంగా ఉందని ఆయన అంబటిపై ధ్వజమెత్తారు. నీవు ఆ పార్టీలో నెల జీతగాడివని, రాజకీయ కూలీవని ఆయన దుయ్యబట్టారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh