online marketing

Tuesday, April 10, 2012

వెలుగొండల్లో ఉన్న స్తం భాలగిరి కోనలో సేదతీరుతారని, భక్తుల కొంగుబంగారంలా

నెల్లూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దిన దినాభి వృద్ధి చెందుతున్న దేవునివెల్లంపల్లి స్తం బాలగిరి ఆలయాన్ని ప్రభు త్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని వెంకటగరి ఎ మ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అభిప్రా య పడ్డారు.సోమవారం ఆయన తిరునాళ్ళకు హ జరై స్వామి వారి కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆలయానికి ఆనుకొనే స్తంబాలగిరి కోన ఉండటం, తిరునాళ్ళకు భక్తులు అధిక సం ఖ్యలో హజరుకావడం తదితర విషయాలను ప్రభుత్వం పరిగణలోకి తీ సుకొని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేం ద్రంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు. వేసవిలో భక్తులు ఈ ఆలయానికి సమీపంలోని వెలుగొండల్లో ఉన్న స్తం భాలగిరి కోనలో సేదతీరుతారని, భక్తుల కొంగుబంగారంలా విరాజిల్లుతు న్న ఈ ఆలయం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలను ఆ యన ప్రశంసించారు. ఆలయానికి వచ్చే రోడ్డు అధ్వానంగా తయారైంద ని తాను శాశ్వత మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయించానని ఆ యన వివరించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh