online marketing

Saturday, April 7, 2012

నెల్లూరు లో 24 గంటలపాటు కాఫీషాప్‌.

నెల్లూరు : నెల్లూరు కెవిఆర్‌ పెట్రోలు బంకు సమీపాన అన్ని హంగులతో నిర్మించిన హోటల్‌ లియో నేడు ప్రారంభం కానుంది. హోటల్‌ను నగర, నెల్లూరురూరల్‌ ఎంఎల్‌ఎలు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, మాజీ మేయర్‌ భానుశ్రీ ప్రారంభిస్తారని ఆహోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.జయప్రకాష్‌ తెలిపారు. స్థానికంగా శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నివసతులతో 105 గదులు నిర్మించామని తెలిపారు. 24 గంటలపాటు కాఫీషాప్‌, నార్త్‌, సౌత్‌, ఇండియన్‌, చైనీస్‌ వంటకాలతో మల్లీక్యూజన్‌ రెస్టారెంట్‌ ఉందన్నారు. ఆన్‌దిరాక్స్‌ లాంజ్‌, సిప్‌ అండ్‌బైట్‌ బడ్జెట్‌ బార్లను ఏర్పాటు చేశామని చెప్పారు. శుభ, భవ, యుక్త, సంయుక్త పేర్ల శుభకార్యాలు చేసుకునేందుకు ఫంక్షన్‌ హాళ్లను నిర్మించామన్నారు. కాఫీ రూ.25, బ్రేక్‌ఫాస్టు 127, నాన్‌వెజ్‌ఫుడ్‌ రూ.199 కు లభిస్తాయని తెలిపారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh