online marketing

Tuesday, April 3, 2012

చిల్డ్రన్స్‌పార్కులో రూ.10 లక్షలతో ప్రహరీగోడ, యాడ్‌ లైటింగ్‌


నెల్లూరు : నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కులో నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డితో కలసి ఆయన చిల్డ్రన్స్‌ పార్కు అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్‌ ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (బిఒటి) విధానం ద్వారా ముందుకొచ్చిన యెడల పార్కును నగర ప్రజల కోసం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో నగరంలోని మరో రెండు పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. చిల్డ్రన్స్‌పార్కులో రూ.10 లక్షలతో ప్రహరీగోడ, యాడ్‌ లైటింగ్‌, గ్రీనరీ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇంకా చేయాల్సిన పనులు స్విమ్మింగ్‌ పూల్స్‌, పిల్లల ఆటపరికరాలు, జిమ్‌, క్యాంటిన్‌, మ్యూజికల్‌ ఫౌంటైన్స్‌ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh