online marketing

Friday, March 9, 2012

ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు

నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార పర్యటనలో శుక్రవారం అపశృతి చోటు చేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తన పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తరఫున జగన్ ప్రచారం చేస్తున్నారు. విడవలూరు మండలంలోని చౌకచర్ల గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పర్యటించారు. జగన్ మాట్లాడుతుండగా అక్కడికి భారీగా జనాలు వచ్చారు. అయితే గ్రామ కూడలిలో ఆయన ప్రసంగిస్తుండగా పక్కనే ఉన్న రేకుల షెడ్డు పైనుంచి ప్రసంగాన్ని వింటున్న యువకులు రేకులు కూలి కింద పడ్డారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.

కాగా అంతకుముందు వావిలాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. మంత్రులు మూటల సంచులతో కొవ్వూరు వస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల అనురాగం, ఆప్యాయతలను డబ్బులతో కొనాలని చూస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి వంత పాడుతున్నారని విమర్శించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh