online marketing

Thursday, March 1, 2012

సోమిరెడ్డి , ప్రసన్నలు కోవూరు నియోజ వర్గానికి వలస వచ్చారు...

కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు మండలంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాకుండా బావబావమరుదులైన సోమిరెడ్డి, ప్రసన్నలు చేసి ఉంటే బహిరంగ చర్చకు రావాలని పోలంరెడ్డి సవాల్‌ విసిరారు. విడవలూరు మండలంలోని చౌకచర్ల గ్రామానికి కాంగ్రెస్‌ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రచార నిమిత్తం వచ్చి విలేకర్లతో గురువారం మాట్లాడారు. సోమిరెడ్డి , ప్రసన్నలు కోవూరు నియోజ వర్గానికి వలస వచ్చారని, కోవూరు నియోజక వర్గం తన సొంత నియోజక వర్గం అని ఈ నియోజకవర్గంపై తన కెంతో ప్రేముందని, ఈ నియోజక వర్గం అభివృద్ధి కోసం నా ఊపిరి ఉన్నంత వరకు పని చేస్తానన్నారు. అలాగే రాష్ర్టంలో ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుంటే కోవూరు ఒక్కస్థానంలో అభ్యర్థిని పెట్టి మిగిలిన ఆరు స్థానాల్లో అభ్యర్థులను పెట్టే ధైర్యం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి లేదన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh