online marketing

Wednesday, March 7, 2012

కోవూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు ఓటు ఈ మెసేజ్‌ను పదిహేను మందికి పంపితే మీ సెల్ ఫోన్‌కి ఐదువందల రూపాయల బ్యాలెన్స్


నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటు వేయాలంటూ ఎస్సెమ్మెస్‌లు సెల్ ఫోన్లలో షికారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేయండని, ఈ మెసేజ్‌ను మరో పదిహేను మందికి పంపితే మీ సెల్ ఫోన్‌కి ఐదువందల రూపాయల బ్యాలెన్స్ వస్తుందని ఎస్సెమ్మెస్‌లు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఎస్సెమ్మెస్‌లపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఎస్సెమ్మెస్‌లకు తమ పార్టీకి గాని, తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కాని ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ కన్వీనర్ పిఎన్‌వి ప్రసాద్ తెలిపారు.

ఈ ఎస్ఎంఎస్ వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉండి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ ఎస్ఎంఎస్‌లో మరిన్ని వివరాలకు సాక్షి టెలివిజన్ చూడాలంటూ తప్పుడు సమాచారాన్ని కూడా అందరికీ ఎస్ఎంఎస్‌లు పంపుతున్నారని ఆయన తెలిపారు. దీనిపై వెంటనే తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh