online marketing

Thursday, March 8, 2012

మహిళను ఉద్దేశించి అమ్మా.. నీవు ఎవరికి ఓటేస్తావని నాయుడు ప్రశ్నించినప్పుడు-ఆమె తాను వైయస్ జగన్‌కే ఓటేస్తానని

కోవూరు : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఓ మహిళ షాక్ ఇచ్చారట. ఆదివారం చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సెంటర్లో మాట్లాడారు. మధ్యలో సభకు హాజరైన ఓ మహిళను ఉద్దేశించి అమ్మా.. నీవు ఎవరికి ఓటేస్తావని అడిగారు. దానికి ఆమె తాను వైయస్ జగన్‌కే ఓటేస్తానని చెప్పింది.

దీంతో బాబు కంగు తిన్నారట. విస్తుబోయిన ఆయన వెంటనే తేరుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే ఫలితం ఉండదమ్మా.. టిడిపికి ఓటేసి గెలిపిస్తే మేలు జరుగుతుందని ఆమెకు సూచించి ప్రసంగం ప్రారంభించారట. స్వయంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించినప్పుడు కూడా ఓ మహిళ ఇలా సమాధానం చెప్పడంతో స్థానిక నేతలు కూడా ఒకింత గందరగోళంలో పడ్డారని అంటున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh