online marketing

Thursday, March 15, 2012

టిడిపి నేత ఓం ప్రకాశం ఇంట్లో దాదాపు కోటి రూపాయలను పోలీసులు పట్టుకున్నారు


నెల్లూరు: ఉప ఎన్నికల నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ధన ప్రవాహం కనిపిస్తోంది. గురువారం కొవూరు నియోజకవర్గం మైపాడ్ గేట్ సెంటర్‌లోని ఓ తెలుగుదేశం పార్టీ నేత ఇంట్లో పోలీసులు భారీగా డబ్బు కనుగొన్నారు. టిడిపి నేత ఓం ప్రకాశం ఇంట్లో దాదాపు కోటి రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఓం ప్రకాశ్ తెలుగుదేశం పార్టీ మాజీ కార్పోరేటర్. ఈ డబ్బు ఓటర్లకు పంచడానికే కావొచ్చుననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో డబ్బు దొరకడంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. తమకు ఇక్కడ డబ్బు ఉన్నట్లుగా సమాచారం వచ్చిందని అందుకే సోదాలు నిర్వహించామని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో రూ.యాభై లక్షలకు లెక్క చూపించారని, మిగిలిన డబ్బు గురించి తెలియడం లేదన్నారు. ఐటి వాళ్లకు సమాచారం అందించినట్లు చెప్పారు.

మరోవైపు ఓం ప్రకాశ్ తన సొంత డబ్బుతో ఇంకా కొంత డబ్బును కలిపి పోలీసులు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. డబ్బు పంచేందుకు అని చెప్పడం సరికాదన్నారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో పోలీసులు జులుం చేసి ఇలా చేస్తున్నారన్నారు. డబ్బుతో పాటు టిడిపికి చెందిన ఎన్నికల సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా అంతకుముందు పోలీసులు భారీగా మద్యంను స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh