online marketing

Tuesday, March 20, 2012

మద్యం సేవించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెపై అత్యాచారం


మనుబోలు : మనుబోలు కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి ఏడేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మనుబోలు శివాలయం సమీపంలో నివాసముంటున్న గిరిజన కుటుంబానికి చెందిన చేంబేటి రమణయ్య వారం రోజుల కిందట మద్యం సేవించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఇంతలో బయట నుంచి వచ్చిన భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు.

దీంతో రమణయ్య పరారయ్యాడు. ఈ విషయాన్ని ఆమె కొందరు గ్రామ పెద్దలకు చెప్పగా విషయం పోలీసులకు తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని ఎవరికీ చెప్పొద్దని సూచించడంతో ఆమె మిన్నకుండిపోయింది. మంగళవారం బాలిక మర్మాంగాల వద్ద నొప్పిగా ఉందని చెప్పడంతో చిన్నారి తల్లి కేఆర్‌పురంలోని ఓ ప్రైవేటు వైద్యుని వద్దకు తీసుకెళ్లింది. బాలికను పరిశీలించిన వైద్యుడు మర్మాంగాల వద్ద రక్తస్రావం అవుతుందని తెలిపాడు. దీంతో తన భర్తే కుమార్తెపై అత్యాచారం చేశాడని ఆమె చెప్పడంతో విషయాన్ని మీడియాకు తెలియజేయాలని డాక్టర్ సూచించడంతో విషయం బయటకు పొక్కింది. రమణయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇంత జరిగినా పోలీసులకు విషయం తెలియక పోవడం కొసమెరుపు.


No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh