online marketing

Saturday, March 10, 2012

దళితవాడకు వెళ్లి ఒక ఇంట్లో నిద్రిస్తున్న వివాహిత పై అత్యాచారం


కొండాపురం : కొండాపురం మండలం తూర్పుయర్రబల్లిలో శుక్రవారం రాత్రి అదేగ్రామానికి చెందిన బండారు స్వామిదాస్ అనే యువకుడు ఉన్మాదిలా వీరంగం సృష్టించాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు... నిందితుడు బండారు స్వామిదాస్ శుక్రవారం సాయంత్రం మందా మరియమ్మకు చెందిన ఒక గేదె, నాలుగు గొర్రెలకు, మందా సత్యవేణి, మందా కొండమ్మలకు చెందిన రెండు గేదెలకు విషగుళికలు పెట్టాడు.

దీంతో అవి మృతి చెందాయి. అనంతరం స్వామిదాస్ రాత్రి 9గంటల సమయంలో చీకూరు మాలకొండయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. రాత్రి 10గంటల సమయంలో లక్కే మల్లమ్మ అనే మహిళ ఇంటికి వచ్చి ఆమె పక్కన నిద్రిస్తున్న పదకొండేళ్ల బాలికను ఎత్తుకెళ్తుండడంతో వారు కేకలు పెట్టారు. దీంతో బాలికను వదిలి వారిపై దాడికి పాల్పడ్డాడు.

అనంతరం రాత్రి 12గంటల సమయంలో దళితవాడకు వెళ్లి ఒక ఇంట్లో నిద్రిస్తున్న వివాహిత పై అత్యాచారానికి యత్నించాడు. ఆ మహిళ కేకలు వేయడంతో పక్కనే నిద్రిస్తున్న ఆమె బంధువులు ఉన్మాదిని పట్టుకుని చితకబాది కట్టేశారు.

స్థానికులు కొండాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై గతంలో కూడా ఇదే విధంగా కేసులు నమోదయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. పశువైద్యాధికారులు మృతి చెందిన గేదెలకు పోస్టుమార్టం నిర్వహించారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh