online marketing

Thursday, March 1, 2012

రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తికి వేల విగ్రహాలు పెట్టడం విడ్డూరంగా...


మాఫియా పార్టీ అయిన కాంగ్రెస్‌ను, ఫాక్షన్‌ పార్టీ అయిన వైఎస్‌ఆర్‌సి పార్టీలను కోవూరు నియోజకవర్గ ప్రజలు ఈ ఉప ఎన్నికలో అంతం చేయాలని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు యర్రన్నాయుడు చెప్పాడు. విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఎటు చూచినా మద్యం మాఫియా, ఇసుక మాఫియా, భూకుంభకోణాలు మితిమీరిపోయా యన్నారు. ఇలాంటి కార్యక్రమాలను పెంచి పోషిస్తున్న పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. లేకుంటే ఇవి రాష్ట్రంలో క్యాన్సర్‌ లాగా వ్యాపిస్తాయన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నో ఉద్యమాలు చేసి పోరాటాల నాయకుడుగా గుర్తింపు పొందారన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన ఎంతోమంది గొప్ప నాయకుల విగ్రహాలు కరువైతే, మాఫియా ఫ్యాక్షన్‌ నాయకుడు, రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తికి వేల విగ్రహాలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రెండున్నర సంవత్సరం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిగా ఉంటూ ఏరోజు పార్లమెంటులో రైతు సమస్యలపై మాట్లాడలేదని, ఈ రోజు రైతుల గురించి దీక్షలు చేపట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టీడీపీ అభ్యర్థి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ

పేద అభివృద్ధి కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ టీడీపీయే అన్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తాను చేసిన అభివృద్ధి పనులు చూపించి ఓట్లు అడగకుండా, వైఎస్‌.జగన్‌ను, విజయమ్మలను చూపించి ఓట్లు అడగడం సిగ్గు చేటన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రసన్నకుమార్‌రెడ్డి ఓటమి తథ్యమన్నారు. ఈ ఉప ఎన్నికలో తనకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన నియోజకవర్గం ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారసులు ప్రసన్నకుమార్‌రెడ్డి కాదని, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అని ఆయన అన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh