online marketing

Wednesday, March 7, 2012

కోవూరులో 12,13 తేదీలలో చిరంజీవి, 13న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రచారం

కోవూరు : కోవూరులో కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ కోరారు. బుధవారం మండలంలోని నార్తురాజుపాళెంలో తలపెట్టిన బహిరంగ సభ, హెలిప్యాడ్‌ల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల9న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన 12,13 తేదీలలో చిరంజీవి, 13న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రచారం చేస్తారని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, కోవూరులో ఎన్నిక ఎందుకు జరుగుతుందో మాత్రం ప్రజలకు తెలుసునన్నారు. స్వార్థపరుల్ని ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి, పనబాక కృష్ణయ్య, నాశన ప్రసాద్, ఇండ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh