online marketing

Tuesday, February 14, 2012

జగన్‌కు ఉన్న ఆదరణ చూసి ము కిరణ్, సోమిరెడ్డికి మైండ్ బ్లాక్ అవుతుందన్నారు

కోవూరు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికలతో కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు భూస్థాపితం చే స్తారని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇంటింటికి వెళ్లి వైఎస్సార్సీ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు మంగళవారం ఆయన మండల పరిధిలోని వావిళ్లలో పర్యటించారు.  అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. ప్రజల్లో జగన్‌కు ఉన్న ఆదరణ చూసి ము ఖ్యమంత్రి కిరణ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిరెడ్డికి మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా విస్మరించారని ఆయన అన్నారు. దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రస్తుతం కుంటుపడుతున్నాయని, ఈ విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారన్నారు. పార్టీ గెలుపునకు వైఎస్సార్సీ అభిమానులు సైనికుల్లా పనిచేయాలని ఆయన సూచించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh