online marketing

Monday, February 13, 2012

కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి చిత్రపటాలు...

చిట్టమూరు : వాళ్లపై మీకంత ప్రేమ ఉందా.. అయితే ఆ ఫొటోలు ఎత్తుకెళ్లి మీ ఇళ్లలో పెట్టుకోండి.. కార్యాలయంలో ఇప్పటి సీఎం, స్వతంత్ర సమరయోధుల ఫొటోలు ఏర్పాటు చేయండి. అంటూ ఎంపీ చింతా మోహన్ అధికారులకు సూచించారు.

సోమవారం ఆయన చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి చిత్రపటాలు ఉండటం చూసి ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. వాళ్లపై మీకంత ప్రేమ ఉంటే ఇళ్లలో ఫొటోలు పెట్టుకోండని అధికారులపై విసుర్లు విసిరారు. అనంతరం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. దళిత గిరిజన కాలనీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనిసూచించారు. అనంతరం పలు ప్రశ్నలతో అధికారులను హడలెత్తించారు. వ్యవసాయాధికారిణి సుజాత గైర్హాజరు అవడంతో వ్యవసాయశాఖకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకొని తిరుపతికి రావాలని ఆదేశించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh