online marketing

Sunday, February 12, 2012

త్వరలో జగన్ జైలుకు వెళ్లడం..

బు చ్చిరెడ్డిపాళెం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆయ న కుమారుడు జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రా న్ని నిలువుదోపిడీ చేశాడని తెలుగుదే శం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు.

బు చ్చిరెడ్డిపాళెంలోని గిరిజా హాల్ ఆవరణంలో ఆదివారం రాత్రి జరిగిన ఆ పా ర్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజశేఖర్‌రెడ్డిని అడ్డం పెట్టుకు ని ఆయన కుమారుడు లక్ష కోట్లు సం పాదించాడని ఆయన అన్నారు. రాష్ట్రం లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ సీఎం అ య్యాక అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం బృహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. రాజశేఖర్‌రెడ్డి కుమారు డి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేయడం వల్లే ఆయన అప్రతిష్టపాలయ్యాడన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాం లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని సోమిరెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో అవినీతి కుంభకోణాలు ఎక్కడా జరగలేదన్నారు. టీ డీపీ కార్యకర్తలకు తలెత్తుకుని ఓట్లు అ డిగే హక్కు ఉందని, జగన్‌పార్టీ కార్యకర్తలు ఆ హక్కు కోల్పోయారన్నారు. రా ష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. త్వరలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh