online marketing

Sunday, February 5, 2012

నెల్లూరు మాజీ ఎమ్మెల్యే జేకే రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో

ఇందుకూరుపేట : కాంగ్రెస్ సీనియర్ నా యకుడు, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే జేకే రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం నగరంలోని శాంతి అపార్టుమెంట్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. జేకే అనుచరులు కూడా పార్టీలో చేరారు.

2014లో వైఎస్సార్సీకే పట్టం ఈ సందర్భంగా జేకే రెడ్డి మా ట్లాడుతూ 2014లో వైఎస్సార్సీ విజ యం ఖాయమన్నారు. వైఎస్ ఇప్పటికి, ఎప్పటికి ప్రజల గుండెల్లో స్థిరనివాసం ఏర్ప రుచు కున్నారన్నా రు. కోవూరులో ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా ప్రసన్న విజయం త«థ్య మన్నారు.

పులివెందులకు ధీటుగా.. పులివెందులకు ధీటుగా కోవూరు లో విజయం సాధించాలని జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీకి విజయమ్మ మొదటి వైఎస్సార్సీ అభ్యర్థిగా అడుగుపెడితే రెండో అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి కాబోతున్నారన్నా రు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాశం సునీల్‌కుమార్, గొల్లపల్లి విజయకుమార్, మావులూరి శ్రీనివాసులురెడ్డి, బట్టేపాటి నరేం ద్రరెడ్డి, దేవిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గునపాటి సురేష్‌రెడ్డి తదితరులు ఉపన్యసించారు. మండలంలోని 20 పంచాయతీలకు చెందిన దాదాపు ఆరు వందల మంది కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్సీలో చేరారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh