online marketing

Friday, February 10, 2012

పర్స్‌ను జేబుదొంగ చోరీ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు

నెల్లూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్‌, మాజీ జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వ్యక్తి పర్స్‌ను జేబుదొంగ చోరీ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. విజయవాడకు చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి నగర శివారులోని కనుపర్తిపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన కాకాణి కుమార్తె వివాహానికి హాజరయ్యాడు. అతని జేబులోని పర్స్‌ను కాజేసిన దొంగ ఎవరో తెలియదు కాని,  వివాహ వేడుకలను తిలకించిన ఆయనకు చివర్లో దొంగ ఝలక్‌ ఇచ్చాడు. రామిరెడ్డికి మాత్రం రూ.10 వేలు చదివింపులుగా వదిలాయి. దీంతో బాధితుడు పర్స్‌ చోరీపై 5వ నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 5వ నగర క్రైం ఎస్‌ఐ శ్రీనివాసరావు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh