online marketing

Sunday, November 27, 2011

స్తంభానికి కట్టేసి మహిళపై దాడి

నెల్లూరు: నగరంలోని పద్మావతి సెంటర్లో ఒక మహిళను స్తంభానికి కట్టేసి, దాడి చేసిన సంఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు పొదలకూరు రోడ్డు ప్రాంతంలోని నేతాజీనగర్ ఏడో వీధికి చెందిన కుమారి అదే ప్రాంతానికి చెందిన జయంతి వద్ద రూ. 80 వేలు అప్పుగా తీసుకుంది. ఇటీవల రూ. 50 వేలు తిరిగి ఇచ్చేసింది. మిగిలిన రూ. 30 వేలు ఇవ్వడంలో ఆలస్యం చేసిందని జయంతి మరి కొంత మందిని వెంటబెట్టుకుని వచ్చి కుమారిని ఇంట్లో నుంచి బయటకు లాగి స్తంభానికి కట్టేసి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. బాధితురాలు కుమారి ఫిర్యాదు మేరకు ఐదో నగర ఎస్సై శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh