online marketing

Sunday, November 6, 2011

అమ్దాపూర్‌ శివారులో వృద్దుడి హత్య


బోధన్‌క్రైం: బోధన్‌ మండలంలోని అమ్దాపూర్‌ గ్రామ శివారులో వర్ని మండలం గోవూర్‌ గ్రామానికి చెందిన దండు మైసయ్య (60) అనే వృద్దుడు శనివారం రోజున హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి మృతుడు మైసయ్య అమ్దాపూర్‌ శివారులోని తన పొలంలో గల ధాన్యం కుప్ప వద్దకు కాపల నిమిత్తం వెళ్ళాడు. శనివారం ఉదయం మైసయ్య చిన్న కుమార్తె బోజనం తీసుకుని పొలం వద్దకు వెళ్ళగా ధాన్యం కుప్పపై మైసయ్య మృతి చెంది కన్పించాడు. దీంతో భయందోళనకు గురైన ఆమె ఇట్టి విషయాన్ని గ్రామస్థులకు, బందువులకు సమాచారం అందించగ సంఘటన స్థలానికి చెరుకున్నారు. ఇట్టి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని విచారణ చెపట్టారు.






శనివారం సాయంత్రం పోలీసులు డాగ్‌ స్కాడ్‌ను రప్పించగా కుక్క సంఘటన స్థలం నుండి రోడ్డు గుండా చెరువు వద్దకు వచ్చి ఉన్న బోరు వద్ద అగి తిరిగి చెరువు సమీపం వరకు వెళ్ళి అగిపోయింది. పోలీసులు చెరువులో ఎమైన ఆధారాలు దొరుకుతాయోనని గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. బోధన్‌ డిఎస్పీ జాఫర్‌ జావీద్‌ సంఘటన స్థలానికి చేరుకుని హత్య విషయం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అన్ని కోణాల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. మృతుడు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు మైసయ్య వద్దనే ఉన్నట్లు తెలిసింది. మృతుడు కుమారుడు శ్రీను పోలీసులకు హత్య గురించి పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో శంకరయ్య తెలిపారు.


No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh