online marketing

Sunday, August 28, 2011

ఒకే ప్రాంగణంలో శివ కేశవుల

తడ : ఒకే ప్రాంగణంలో శివ కేశవుల అన గా శివుడు, కేశవుడు(విష్ణువు) ల ఆలయాలు, విగ్రహాలు కాశీలో తప్ప మరెక్కడా లేదు. ప్రపంచంలో ఈ అద్భుత ఆలయాలని సందర్శించి పాప, దోషములను పొగొట్టుకొనేం దుకు యావత్‌ భారతీయులందరూ కాశీకి పో తారు. అక్కడికి పోతే పాపాలన్నీ పోయి మళ్ళీ పునర్జ న్మ మనిషికి కలుగుతుందని ప్రతీక. కా ని కాశీలో మాదిరిగానే పులికాట్‌ తీరం లో వున్న వేనాడు దీవిలో కూడా శివ, విష్ణువు ఆల యాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ఆల య ప్రత్యేకత గురించి అధికారులు, పాలకులు ఎవరూ పట్టిం చుకోకపోవడంతో ఇంతటి ప్రా ముఖ్యత గల ఆలయాలు చరిత్ర బయట ప్ర పంప ప్రజలెవరికి తెలియదు.

పూర్వం వేనాడు ను వేదాంతపురి అని పిలిచే వారు.పూర్వ ము శృంగి అనే మహాముని కావడిలో ఒకపక్క శివు ని విగ్రహం మరో పక్క విష్ణువు విగ్రహాన్ని తీసు కొని కాశీ నుంచి రామేశ్వరానికి పయనమ య్యాడు. మార్గమధ్యలో పలు చోట్ల రాత్రి వేళల్లో విశ్ర మిస్తూ మరుసటి దినం యథా విధిగా పాద యాత్ర కొనసాగించే వారుఆ మహాముని. అదే క్రమంలో వేనాడు దీవిలో ఆ ముని ఓ రాత్రి విశ్రమించాడు. మరుసటి దినం ప్రభాత వేళ ప్రయాణానికి సన్నద్ధ్దుడైన ఆ మహాముని కావడిని భూజానికి ఎత్తుకునేం దుకు ప్రయత్నిస్తే కావడిపైకి లేవలేదు.ముని పరిశీలించగా శివకేశవులు భూమిలో ప్రతి ష్టిం చినట్లుగా కనిపించింది.

ఆ రాత్రి అక్కడే వి శ్రమించిన ముని కి స్వప్నంలో శివకేశువులు ప్రత్యక్షమై ఈ స్థలం ప్రభావి తానికి ఇష్టపడి తా ము స్వయంభువుగా ఇక్కడే ప్రతిష్టంబులు అయ్యామని ఆ మునినే తమకు పూజాధిపతు లుగా నియమించమని ఆదేశించినట్లు పురాణ కథనం. అలా ఒకే ప్రాంగణంలో దేవదేవుని ఆలయాలను నిర్మించారు. ఒకే ప్రాంగణంలో విష్ణాలయం, శివాలయం వెలసినందున ఈ గ్రామాన్ని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యం కాశీలో తప్ప మరెక్కడా లేదు. అక్కడే గర్భ గుడిలో ప్రతిఏటా చైత్ర మా సం పౌర్ణమికి శ్రీరంగ పెరుమాళ్ళు పాద పద్మా లపై, శివ రాత్రికి శివుని పై సూర్య కిరణాలు ప్ర తి భింబిస్తాయి. ఈ దృశ్యాలు చిత్తూరు జిల్లా నాగాలాపురం వేదనారాయణ స్వామి ఆలయం లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా లేదు. కానీ ఈ ఆలయాన్ని టూరిజం కేడర్‌ చేర్చలేదు. ఇంతే కాకుండా ఆసియా ఖండంలోనే అతి పెద్ద దర్గా ఈ గ్రామంలో ఉండడం మరో విశేషం.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh