online marketing

Friday, June 3, 2011

జగన్ కనె్నర్ర చేయాలి ప్రభుత్వాన్ని పడగొట్టాలి

పొదలకూరు : కనె్నర్ర చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని, తన దయాదాక్షణ్యాలపైనే ప్రభుత్వం ఉందంటూ చెప్పుకునే జగన్ అన్న మాటపై నిలబడాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో గత ఏడేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై తెలుగుదేశం పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరులో శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో థర్మల్ ప్రాజెక్టుల కాలుష్యంపై , వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై పోరాటం చేస్తున్నామన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల కార్యకర్తలతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మండల టిడిపి అధ్యక్షుడు వెంపులూరు పుల్లయ్యగౌడ్, మండల టిడిపి నాయకులు టి రఘురామిరెడ్డి, సుబ్బరామనాయుడు, షేక్ చాంద్‌బాషా తదితరులు ఈ కార్యిక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh