online marketing

Friday, June 3, 2011

మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం కానివ్వం

నెల్లూరు : జామియా మసీదుకు చెందిన స్థలాన్ని అన్యాక్రాంతం కానివ్వబోమని మసీదు వక్ఫ్ మేనేజ్‌మెంట్ కమిటీ మెంబర్ ఆసిఫ్‌బాషా పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో శిఖరంవారివీధిలోని జామియా మసీదుకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయన్నారు. అందులో కొంత భాగం అన్యాక్రాంతమైందన్నారు. నగర శివారులో మనుమసిద్దినగర్ లేఅవుట్‌కు ఆనుకొని ఉన్న 117, 118, 119, 120, 121 సర్వే నంబర్లలో 13.33 ఎకరాల భూమి వక్ఫ్‌బోర్డ్ పర్యవేక్షణలో మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఉందన్నారు.

గతంలో ఆర్కాట్ నవాబు జామియా మసీదులో నమాజ్ విధులు నిర్వహించేందుకు ఆ భూమిని కేటాయించారన్నారు. ఆ భూమిలో వచ్చే ఫలితాన్ని ముత్తవల్లి జుబీదాబేగం పూర్వీకులు నమాజ్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారన్నారు. వారికి ఆ భూమిని అమ్మేందుకు ఎటువంటి అధికారం లేదన్నారు. 10 సంవత్సరాల క్రితం మసీదుకు చెందిన 3.5 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందన్నారు. కొన్నేళ్లుగా అసాంఘికశక్తులు, మసీద్ భూమిని స్వాహా చేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో షేక్.సంధానిబాషా సయ్యద్, షకీల్ అహ్మద్, సయ్యద్‌ఖాదర్‌బాషా, షేక్, షబ్బీర్, షేక్, మున్నీర్‌బాషా, సయ్యద్ సలార్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh