online marketing

Friday, June 3, 2011

వచ్చే ఎన్నికల్లో జగన్‌దే ప్రభంజనం

కావలి : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనంలో మిగిలిన రాజకీయ పార్టీలు కొట్టుకుపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మహానేత వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే ఒక్క యువనేత జగన్ వల్లే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, శివకుమార్‌రెడ్డి, కుందుర్తి కామయ్య, ప్రసాద్‌రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, డేవిడ్, పద్మనాబరెడ్డి, రామచంద్రారెడ్డి, తుమ్మలకోటారెడ్డి, సాయి, సర్పంచులు కొండారెడ్డి, జంపాని రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh