online marketing

Friday, June 3, 2011

మృతుల కుటుంబాలకు మంత్రి ఆనం పరామర్శ

రాపూరు : ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాశీ యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అశువులు బాసిన రాపూరు మండలంలోని జోరేపల్లి గ్రామానికి చెందిన వారి కుటుంబీకులను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. గురువారం జోరేపల్లికి వచ్చిన ఆయన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తలుపూరు సరోజనమ్మ కుటుంబీకులను పరామర్శించారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమెతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా మృతిచెందారు. ఈ నేపథ్యంలో రాపూరు మండల వాసులతో ఉన్న సుదీర్ఘ పరిచయాల నేపధ్యంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వీరి కుటుంబీకులను పరామర్శించారు. మంత్రి వెంట సైదాపురం ఎంపిపి రవికుమార్, రాపూరు ఈద్గా కమిటీ చైర్మన్ షేక్ ముక్తియార్ ఉన్నారు. ఈ పరామర్శ అనంతరం మంత్రి ఆనం మద్దెలమడుగు నాలుగు రోడ్ల కూడలిలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కొద్దిసేపు చర్చించారు. పర్యటనలో భాగంగా పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి అందచేశారు. రాపూరు పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ పంచాయతీ సిబ్బంది అర్జీ అందచేశారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh