online marketing

Wednesday, May 4, 2011

జగన్ అన్నీ దోచుకెళ్లావు మాకేమి మిగిల్చావు, పద్ధతి మార్చుకో: ఆనం

నెల్లూరు జిల్లా  మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సంపదను అంతా దోచుకు వెళ్లాడని మాకు ఏమీ మిగిల్చాడని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. డబ్బు మూటల్ని మొత్తం నువ్వే అక్రమంగా తీసుకు వెళ్లావు అన్నారు. అలాంటి అక్రమ డబ్బుతో జగన్ గెలవాలని అనుకుంటున్నాడని కానీ ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి, జగన్‌తో పోటీయా అని ప్రశ్నించారు. వారిద్దరికీ నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

రౌడీయుజం చేసి ఎన్నికల్లో గెలవాలనుకోవడం తప్పన్నారు. రెండురోజులుగా ఇద్దరు ముఖ్యనేతలపై ఆయన వర్గం దాడులకు పాల్పడిందన్నారు. జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకో అని హెచ్చరించారు. ఎన్నికలు తమ స్వార్థ ప్రయోజనాలకు ఎవరో కోరుకుంటే వచ్చేవి కావన్నారు. కడపలో రౌడీయిజాన్ని జగన్ పెంచి పోషిస్తున్నాడని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వాళ్లు ప్రజాభిప్రాయానికి విలువ ఇస్తారని ఎలా అనుకుంటామని అన్నారు. అలా అనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్నారు. జగన్ జనాన్ని రెచ్చగొడుతున్నారన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh