online marketing

Thursday, May 26, 2011

కాకాణికి పదవిపై నాయకుల హర్షం

కొడవలూరు:జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ జిల్లా కన్వీనర్‌గా నియమించడంపై కొడవలూరు జగన్‌ వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి, రాబోయే ఎన్నికల్లో గెలుపునకు కాకాణిని జిల్లా కన్వీనర్‌గా ఎంపిక చేయడం ఆయన సత్తాపై జగన్‌కు ఉన్న నమ్మకమేనన్నారు.అధికారపార్టీ టిడిపికి కడప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా పోవడంపై జిల్లా గ్రంధాలయ ఛైర్మన్‌ మందిపాటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి జగన్‌ సత్తాను చాటుకున్నారన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలసికట్టుగా పనిచేస్తామన్నారు. విడవలూరు జడ్పీటిసి వీరి చలపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కడప ఎన్నికలు చర్చనీయాంశం అయినాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి జగన్‌మోహన్‌రెడ్దిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండవరం ఎంపిటిసి మోహన్‌కృష్ణ, కొడవలూరు మండల సర్పంచ్‌లసంఘం అధ్యక్షుడు చిమటా శేషగిరి, నార్త్‌రాజుపాళెం ఉప సర్పంచ్‌ కొండా శ్రీనివాసులురెడ్డి, మైనారిటీ నాయకులు కరిముల్లా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh