online marketing

Wednesday, May 4, 2011

13 ఎర్రచందనం దుంగలు పట్టివేత..

డక్కిలి: డక్కిలి మండలంలోని వెంబులూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో మంగళవారం అటవీశాఖ అధికారులు జరిపిన దాడుల్లో సుమారు లక్ష రూపాయలు విలువచేసే ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లుగా డిఫ్యూటి రేంజర్‌ శేఖర్‌ తెలిపారు. వెంబులూరు తీర్థంపాడు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఎర్రచందనం అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుందన్నారు. ఈ స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు వ్యూహత్మకంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్మగ్లర్లు ఎత్తుగడలను చిత్తుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే మంగళవారం జరిపిన దాడుల్లో అక్రమరవాణాకు సిద్ధంగా ఉంచిన 13 ఎర్రచందనం దుంగలను ఇన్ఫర్మర్‌ల సాయంతో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh