online marketing

Wednesday, April 20, 2011

మంత్రి దిష్టి బొమ్మ దగ్దం

సైదాపురం,మేజర్‌న్యూస్‌ః సమస్యలను పరిష్కరించకుండా కాల యాపన చేస్తున రాష్ట్ర గ్రామీణ అభివృద్ది శాఖా మంత్రి మాణిక్య వరప్రసాద్‌రావు దిష్టి బొమ్మను ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు మంగళవారం దగ్దం చేశారు.ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ గత వారం రోజులుగా నిరవదిక సమ్మె నిర్వహిస్తున్న అధికారులు కాని, ప్రభుత్వం కాని పట్టించుకోకపోవడం భాధాకరమని యూనియన్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. సైదాపురం బస్టాండ్‌ నుండి ర్యాలి నిర్వహించి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద నిరవదిక సమ్మెను కొన సాగించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ యూనియన్‌ నాయకులు కుడుముల రమణయ్య, కేశవులు, ప్రభాకర్‌, శివ, రామకృష్ణ, సిఐటియు నాయకులు ముత్యాలయ్య, ఎమ్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh