online marketing

Tuesday, April 19, 2011

మర్రిపాడు స్టేషన్‌లో ప్రేమజంట

మర్రిపాడు: మర్రిపాడు పోలీసుస్టేషన్‌లో సోమవారం ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించారు. మండల పరిధిలోని ఏపిలగుంటకు చెందిన పొదిలి తేజ అదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ముత్యాల వ్యాపారం చేస్తుండేవాడు. అక్కడ స్వాతిక అనే అమ్మాయితో గత ఎనిమిది నెలలుగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇటీవల తేజ కడప జిల్లా ముద్దనూరులో ఉంటున్నాడు. వీరు ఫోన్‌లో ప్రేమాయణం సాగించారు. గత మూడు రోజుల క్రితం ఒకరినొకరు మాట్లాడుకుని తేజ నిర్మల్‌ వెళ్ళి సాత్వికను ఏపిలగుంటకు తీసుకునివచ్చాడు.

అయితే ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు నిర్మల్‌ పోలీసుస్టేషన్‌లో తమ కుమార్తె అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన వారు తేజకు సంబంధం ఉందని మర్రిపాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మర్రిపాడు ఎసై్స నాగేశ్వరరావు పూర్తి వివరాలు తెలుసుకుని నిర్మల్‌ సీఐ నరసింగరావుకు సమాచారం అందించారు. ఆతర్వాత తల్లిదండ్రులతో పోలీసుస్టేషన్‌కు చేరుకున్న తేజ, సాత్వికలు పెళ్ళి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అయితే సాత్విక మైనర్‌ తీరలేదని తేలింది.ఈవిషయం ఇరువురి తల్లిదండ్రులను ప్రశ్నించి వారి ఇష్టానుసారంగా విచారణ జరిపారు. ఇరువురు పెళ్ళికి అంగీకరించడంతో ఈ నెల 23న నిర్మల్‌లో పెళ్ళి చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh