online marketing

Friday, April 22, 2011

నెల్లూరు విద్యార్థులే టాప్

నెల్లూరు  : ఇంటర్ ప్రధమ సంవత్సర ఫలితాల్లో నెల్లూరు హవా కొనసాగింది. గురువారం విడుదలైన ఫలితాల్లో నెల్లూ రు జిల్లా కేంద్ర బిందువైంది.జిల్లాకు చెందిన విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు రాష్ట్ర స్థాయి ఫలితాలలో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి కీలక పాత్ర పోషించారు.

నగరంలోని స్టోన్‌హౌస్‌పేట నారాయణ బ్రాంచికి చెందిన జగదీష్‌కుమార్ ఎంపీసీ విభాగంలో జిల్లాతోపాటు రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచాడు. నారాయణ మెడికల్ ఇంటెన్సివ్ క్యాంపస్‌కు చెందిన విద్యార్థిని వి. మధులిక రాష్ట్రంలో బైపీసీ విభాగంలో ప్రధమ స్థానం సాధించింది. ఎంపీసీలో ఎన్. నాగశివాని రాష్ట్రంలో నాలుగో స్థానం కైవశం చేసుకుంది.

నెల్లూరు శ్రీ ఛైతన్య కళాశాలకి చెందిన విజయలక్ష్మి జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది. బైపీసీలో వీ తేజశ్వి రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది. వెంకటాచలం ప్ర భుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విద్యార్థి పర్వతాల గోపి జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించాడు. సీఈసీ విభాగంలో సుభాషిణి ప్రభుత్వ కళాశాల సత్తా చాటింది. ఎంఈసీ విభాగంలో కృష్ణ చైతన్య కళాశాలకు చెందిన టీ వసుధ జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచింది. ఎస్‌వీఎస్ శశిధర్‌రావు ద్వితీయ స్థానంలో నిలిచాడు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh