online marketing

Tuesday, April 19, 2011

వైయస్సే సాధించలేదు, జగన్ మెజార్టీ సాధిస్తారా!: ఆనం వివేకానంద రెడ్డి

నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కూడా 3 లక్షల ఆధిక్యం సాధించలేదని ఎప్పుడూ సాధించలేదని నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి మంగళవారం అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రెండు లక్షల మెజారిటీ వస్తుందని జగన్ వర్గం నేతలు చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఖచ్చితంగా కడప, పులివెందులలో కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్, విజయమ్మల పేరుతో డమ్మీ అభ్యర్థుల దరఖాస్తులో కాంగ్రెసు పార్టీ పాత్ర లేదని అన్నారు. అలాంటి అవసరం తమకు లేదన్నారు.

జగనే కాంగ్రెసు ఓట్లను కొల్లగొట్టడానికి రవీంద్రారెడ్డి పేరుతో డమ్మీ అభ్యర్థులను వేయించారని ఆరోపించారు. ఏజెంట్ల కోసమే జగన్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారన్నారు. ఎన్నికలలో ధన ప్రభావాన్ని అడ్డుకోవాలని ఆయన ఎన్నికల సంఘానికి సూచించారు. వైయస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రెసుకున్న అభిమానాన్ని ఎవరూ వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెసు పార్టీలోని ప్రతి కార్యకర్త వైయస్‌ను అభిమానిస్తారని అన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh