online marketing

Saturday, March 19, 2011

వరకట్నం వేధింపుల కేసులో సినీ నటి ఆమని

నెల్లూరు‌: వరకట్నం వేధింపుల కేసులో సినీ నటి ఆమని మంగళవారం నెల్లూరు కోర్టుకు హాజరయ్యారు. ఆమని సోదరుడి మొదటి భార్య శశికళ ఆమనిపై, ఆమె కుటుంబ సభ్యులపై వరకట్నం వేధింపుల కింద నెల్లూరు కోర్టులో ఫిర్యాదు చేశారు. నెల్లూరు కోర్టు ఈ కేసును విచారిస్తోంది. ఆమని సోదరుడు శశికళకు దూరమై మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.

నెల్లూరు కోర్టుకు హాజరైన ఆమని ఫోటోలను మీడియా ప్రతినిధులు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఆమె భర్త హజ్రత్ మీడియా ప్రతినిధులపై తిట్ల పురాణం అందుకున్నారు. కేసు విచారణను కోర్టు మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh