online marketing

Saturday, March 19, 2011

ఘనంగా సరస్వతిపూజ

పొదలకూరు రూరల్‌,మేజర్‌న్యూస్‌: మండలంలోని ఇనుకుర్తి గ్రామంలోని జడ్పీ ఉన్నతపాఠశాలలో గురువారం జరిగిన సరస్వతిపూజను ఘనంగా నిర్వహించారు. ఈ సరస్వతి పూజకు మండల ఎంపిడీవో సరళ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ స్కూల్‌ విద్యార్ధులకు సాఫ్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వి.రవికుమార్‌ తల్లి శారదమ్మ జ్ఞాపకార్ధంగా 10వ తరగతి విద్యార్ధులకు ప్యాడ్లు, పెన్నులు అందచేశారు.ఎంపిడివో సరళ మాట్లాడుతూ విద్యార్ధులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.మెరీనా మాట్లాడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మార్కులు సాధించాలని విద్యార్ధులకు విలువైన సలహాలు చేశారు. మంచి మార్కులు తెచ్చుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకుని రావాలని కోరారు. అంతకు ముందు విద్యార్ధులు హాల్‌ టికెట్లను సరస్వతి విగ్రహం ముందు ఉంచి వారికి అందచేశారు. ఈ కార్యక్రమంలో మ్రాజీ సిడిసి చైర్మన్‌ పెదమల్లు రమణారెడ్డి, సర్పంచ్‌ నారాయణరెడ్డి, ఉపాధ్యాయులు ఏవి.సుధాకర్‌, పద్మావతి, గోపి, శ్రీనివాసులు తదితరులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh