online marketing

Wednesday, February 10, 2010

కోటి రూపాయల దొంగలు అరెస్ట్‌

నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నది ఆనాటి సామెత. అయితే నగర పోలీసులు సోమవారం కాకర్లవారివీధిలోని ఎస్‌విఆర్‌ ట్రేడర్స్‌ షాపులో చోరీ చేసిన కోటి రూపాయల బంగారు నగదును 48 గంటల్లో రికవరీ చేశారు. నగరంలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లోని ఉమేష్‌చంద్ర అతిథి గృహంలో చోరీకి పాల్పడిన దొంగలను అదుపులోకి తీసుకున్న సందర్భంగా బుధవారం జిల్లా ఎస్‌పి బి.మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌విఆర్‌ ట్రేడర్స్‌లోని శ్రీనివాసులుశెట్టికి చెందిన రూ.73 లక్షల నగదు, 20 బంగారు బిస్కెట్లను అదే షాపులో గుమస్తాగా పనిచేస్తున్న బచ్చల దినేష్‌కుమార్‌రెడ్డి, అతని మామ నూతక్కి రామచంద్రరావు, బావమరుదులు రవికుమార్‌, వెంకటేశ్వర్లు సహాయంతో చోరీ చేశారని తెలిపారు.వీరు గతంలో దినేష్‌రెడ్డి శ్రీనివాసులుశెట్టి వద్ద రెండేళ్లు పనిచేసి తదుపరి మానుకుని మళ్లీ మూడు నెలల క్రితం చేరాడని ఆయన తెలిపారు. అయితే ప్రతి విషయానికి యజమాని తనను విసిగిస్తున్నందుకు, కొంత మేర ఆర్థిక ఇబ్బందుల కారణం వల్ల ఈ చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. దినేష్‌రెడ్డి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు యజమాని వద్దే పనిచేసి తదుపరి నగరంలోని మొదటి షో సినిమాకి, రెండవ షో సినిమాకి వెళ్లాడు. అప్పటికే యజమానికి ఇతనిపై పూర్తి నమ్మకం ఏర్పడడంతో రూ. కోటి వరకు కూడా బ్యాంకులో జమచేయడం వంటి కార్యక్రమాలేకాక షాపునకు సంబంధించిన తాళాలు ఇతనికే ఇచ్చి వెళ్తుండేవాడని ఎస్‌పి తెలిపారు. ఇందులో భాగమే తాళాలు తన చేతికి అందడంతో వాటిని మైనం మీద అచ్చులు గుద్దుకుని వాటిని తమ బంధువులైన నూతక్కి రామచంద్రరావు, రవికుమార్‌, వెంకటేశ్వర్లు ద్వారా మారు తాళాలను తయారు చేయించాడు. వీటి ఆధారంగా సోమవారం రాత్రి ముందుగా బంధువులని షాపులోకి ప్రవేశింపచేసి తాళాలను తెరచి లాకర్‌లోని బంగారు, నగదును ఒక ఎర్రబ్యాగులో ఉంచుకుని బయటికొచ్చారు. అదే సమయంలో కింద మోటార్‌బైక్‌ను పెట్టుకునివున్న దినేష్‌రెడ్డితో వారి పథకాన్ని చర్చించుకున్నారు. తదుపరి దినేష్‌రెడ్డి ఇంటి సమీపంలో పొరపాటున కొంత నగదును జారవిడుచుకున్నారు. అక్కడనుంచి మద్రాసు బస్టాండు వద్దకు చేరి కాళహస్తికి పోవడానికి వాహనం కావాలని మాట్లాడి కుదరక ఆత్మకూరు బస్టాండు వద్దకు వెళ్లారు. అక్కడ కూడా వీరికి వాహనం బాడుగకి కుదరకపోవడంతో నేరుగా ఆర్టీసి బస్టాండుకు చేరుకోవడం జరిగింది. నగదును మాత్రం బ్యాగులో ఉంచుకుని ముగ్గురు వ్యక్తులు బస్సులో కాళహస్తికి చేరుకున్నారు. బంగారు బిస్కెట్లను మోటార్‌ సైకిల్‌ పెట్రోలు ట్యాంక్‌లో జారవిడచి ఎవరికీ అనుమానం రాకుండా మూత బిగించేశారు. అయితే దినేష్‌ ఇంటి వద్ద వీరందరూ మాట్లాడుకోవడం అనుమానంగా ఉండడంతో పోలీసులు వారిని చేరేసరికి వారు అక్కడనుంచి జారుకున్నారు. వీరి చేతిలోని ఎర్రబ్యాగు ఆధారంగా ఆ నలుగురి పోలికలను కొంత మేరకు పోలీసులు గుర్తు పట్టడంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు వారు చోరీ బట్టబయలైంది. పోలీసులు వెంటనే బస్టాండు అంతా విచారించగా కొందరు వ్యక్తులు బ్యాగు తగిలించుకుని బస్సులో పోవడం జరిగిందని అక్కడున్న ప్రయాణీకులు తెలపడంతో వీరి అనుమానం నిజమైంది. అప్పటికే కాళహస్తిలోని పద్మజ లాడ్జిలో దిగిన వారు బ్యాగును మాత్రం దేవస్థానం వద్ద ఉండే లాకర్లలో ఉంచి వెళ్లిపోయారు. అప్పటికి అప్రమత్తమైన అధికారులు వీరి ఆచూకి కోసం ప్రయత్నించగా వారు కాళహస్తి లాడ్జీలో ఉన్నట్లు గుర్తించి నగర డిఎస్‌పి రాధిక తన సిబ్బందితో కలసి కాళహస్తి పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దవున్న కోటి మూడు లక్షల రూపాయల సొమ్మును రికవరీ చేయడం జరిగిందని ఎస్‌పి తెలియజేశారు.ఈ చోరీని 48 గంటల్లో ఛేదించి ఊపిరి పీల్చుకున్నారు. ఈ చోరీని ఛేదించిన అధికారులకు, సిబ్బందికి ఎస్‌పి రివార్డులు ప్రకటించారు. నగర డిఎస్‌పి జిఆర్‌. రాధిక, సిసిఎస్‌ సిఐ జె.మురళీకృష్ణ, 3వ నగర క్రైం ఎస్‌ఐ టి.కృష్ణ, రేంజ్‌ ఐడి పార్టీ ఎఎస్‌ఐ ఎన్‌.సుధాకర్‌, షేక్‌ షపీ అహ్మద్‌ ఎఎస్‌ఐ, షేక్‌ షరీఫ్‌ ెహ డ్‌కానిస్టేబుల్‌, పి.వేణుగోపాల్‌రావు పిసి, ఎస్‌.కృష్ణమూర్తి, జి.రవిచంద్రకుమార్‌, జి.సుబ్బారావు, కె.గిరిధర్‌రావు, సిహెచ్‌. శివకుమార్‌, ఆర్‌.గిరిధర్‌, ఎస్‌డి.వారిస్‌అహ్మద్‌, జి.మాల్యాద్రి, ఎస్‌. సుస్రాజ్‌ అనిల్‌కుమార్‌, పి.రాజ్‌కిషోర్‌, సిహెచ్‌.వెంకటేశ్వర్లు, వి.గోవర్థన్‌, సిహెచ్‌వి.రమణయ్య, సుధాకర్‌సింగ్‌, బి.రమేష్‌, ఎల్‌.మాధవి, వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌సింగ్‌, పరంధామయ్య, న రసింహారావులకు రివార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషినల్‌ ఎస్‌పి జె.కనకరావు, నగర డిఎస్‌పి రాధిక, క్రైం సిఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh