online marketing

Tuesday, February 9, 2010

భారీ చోరీ

నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌: నగరంలోని కాకర్లవారివీధిలోని ఎస్‌విఆర్‌ ఫ్యూచర్‌ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఆఫీస్‌లో కోటి రూపాయల విలువైన బంగారు బిస్కెట్లు, నగదు ఆదివారం రాత్రి చోరీకి గురయ్యింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్‌పి బి.మల్లారెడ్డి, అడిషినల్‌ ఎస్‌పి కనకారావు, నగర డిఎస్‌పి జిఆర్‌.రాధిక తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ చోరీపై జిల్లా ఎస్‌పి మల్లారెడ్డి మాట్లాడుతూ ఎస్‌విఆర్‌ ఫ్యూచర్‌ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యజమాని కె. శ్రీనివాస్‌ గత రెండేళ్లుగా ఈ ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఆఫీస్‌లోనే ట్రేడింగ్‌ చేస్తూ తదుపరి ఆఫీస్‌కు తాళం వేసి మిద్దెపై కాపురముంటున్న తన నివాసానికి వెళ్లాడని, ఉదయం 6 గంటల సమయంలో తన ఆఫీస్‌ తాళాలు తీసి ఉండడాన్ని గమనించి లోపలికెళ్లి చూడడంతో రూ.73 లక్షల నగదు, రెండు కిలోలు బంగారు బిస్కెట్లు చోరీకి గురయ్యాయని 3వ నగర క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ఆఫీస్‌కు దగ్గరలో ఆదివారం రాత్రి బీట్‌ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్‌ పరంధామయ్య, హోంగార్డు నరసింహరావుకు రూ.5 లక్షల నగదు దొరకగా వారు వెంటనే తమకు తెలియజేసినట్లు ఎస్‌పి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి తాము దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌పి తెలియజేశారు.
అనుమానాస్పదంగా చోరీమారు తాళాలతో షట్టర్‌ తాళాలు తీసి లోపలికి ప్రవేశించిన దొంగలు ఎలాంటి ఆధారాలు లేకుండా చోరీ చేయడమే కాక ఆఫీస్‌కు సమీపంలో రూ.5 లక్షలు పోలీసులకు దొరకడం అనుమానాస్పదంగా ఉంది. ఎస్‌విఆర్‌ కంపెనీలో చోరీకి గురైన రూ.73 లక్షల్లోని నగదులో రూ.5 లక్షల బండిల్‌ బీట్‌ కానిస్టేబుళ్లకు దొరికిందా లేక ఇది మరొకటా అన్న విషయం సంశయాత్మకంగా ఉంది. దీన్నిబట్టి ఈ చోరీ బాగా తెలిసినవారే చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. క్లూస్‌ టీం ఆ ప్రాంతానికి వచ్చి క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లేకపోవడం శోచనీయం. దీనిపై అధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే పూర్తి వివరాలు బయట పడగలవు.
నిజాయితీకి మారుపేరు వీరిద్దరుకుడిచేతికి దొరికిన సొమ్మును ఎడమచేతికి తెలియకుండా దాచుకోవాలనుకునే నేటి రోజుల్లో, అందులోనూ ఇందులో అందెవేసిన పోలీస్‌శాఖలో వీరిద్దరి లాంటి నీతిపరులు కూడా ఉన్నారని తెలియచెప్పిన కానిస్టేబుల్‌ పరంథామయ్య, హోంగార్డు నర్శింహరావులు ఆ శాఖలోని ఇతర సిబ్బందికి మార్గదర్శకులుగా మారారు. రూ.5 లక్షలు నగదు దొరికిన వెంటనే వారు తమ పై అధికారులకు తెలియజేసి నగదును అధికారులకు అప్పగించడం అభినందించదగ్గ విషయం. వీరి నిజాయితీని ఆ శాఖలోని పలువురు పోలీసులు కొనియాడారు. అయితే ఉన్నతాధికారులు వీరి నిజాయితీని మెచ్చి తగిన రీతిలో అభినందిస్తే మరికొందరికి వీరు దారి చూపేందుకు వీలు కల్పించినవారవుతారని పోలీస్‌ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh