online marketing

Tuesday, February 16, 2010

ముగ్గురు కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు


నెల్లూరు, మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : జిల్లాలో ముగ్గురు కాంట్రాక్టర్ల వల్ల జలయజ్ఞం ఆశయం మూలన పడిందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ధ్వజమెత్తారు. కాలువ పనుల్లో, జలయజ్ఞంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంటోందని, దీనివల్ల ప్రజా ధనం దుర్వినియోగం కావడమే కాకుండా ప్రభుత్వ లక్ష్యాలకు గండి పడుతోందని ఆయన ఆరోపించారు. ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై ప్రశ్నలను లేవనెత్తనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రకాశం, అనంతపురం జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి వంద ప్రశ్నలను అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రస్తావించాలని కోరుతూ అసెంబ్లీకి పంపించినట్లు ఆయన అన్నారు. సాధారణంగా ఎమ్మెల్యే కోరితే ఒక ప్రశ్నే చర్చకు వస్తుందని, గ్రూపు ప్రశ్నలకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని అవన్నీ చర్చకు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. జిల్లాలో కాంట్రాక్ట్‌ పనులు కేవలం ముగ్గురు బడా కాంట్రాక్టర్లు చేజిక్కించుకుని చక్రం తిప్పాలన్న ప్రయత్నంలో ఉన్నారని ఆనం వివేకానందరెడ్డి అన్నారు. తాము తిన్నది కాకుండా చైనా కంపెనీకి అక్రమంగా రంగంలో దింపారని, ఇది ప్రభుత్వ రికార్డుల్లో లేకపోవడం విశేషమని ఆయన ఆరోపించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని వారి ఆటలను సాగనివ్వమని ఆయన చెప్పారు. జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కృష్ణపట్నం పోర్టులో నిర్మించనున్న జెన్‌కో సంస్థ పురోగతికి కొందరు అడ్డుపడుతున్నారని, స్వార్థ రాజకీయాలతో ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు కూడా ప్రస్తావించనున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం త్వరితగతిన ఏర్పాటు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేతలో ఆలస్యం, నెల్లూరు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి నిధుల మంజూరు, వెంకటగిరి ప్రాంతం కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌, పౌరసరఫరాల సంస్థ ద్వారా జరుగుతున్న నిత్యావసర వస్తువుల పంపిణీలో లోపాలు, ధరల నియంత్రణ వంటి అనేక సమస్యలు ప్రస్తావించనున్నట్లు ఎమ్మెల్యే వివేకా వివరించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh