online marketing

Wednesday, February 3, 2010

ఇరవైవేలకు పసికందు విక్రయం?


ఉదయగిరి, మేజర్‌ న్యూస్‌: విధి వంచితురాలైన ఒక అమాయకురాలికి జన్మించిన పసిబిడ్డను ప్రైవేటఖ వైద్యశాల నిర్వాహకులు స్థానిక గొల్లపాళెం వీధికి చెందిన ఒక మహిళకు విక్రయిస్తే ఆమె రూ.20 వేలకు చెనై్నకి చెందిన మరొక మహిళకు విక్రయించి బిడ్డచేతులు మారేలోపే కన్ను మూసిన దారుణ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ సంఘటనలో మరొక విషయం వెలుగుచూసింది. మండల పరిధిలోని దుంపవారిపల్లి గ్రామానికి చెందిన పెన్నా కొండమ్మ అనే అంధురాలైన యువతిని అదేగ్రామానికి చెందిన చిలకల రమణారెడ్డి అత్యాచారం చేయగా ఆమె గర్భం దాల్చింది. అయితే విషయం బయటకు పొక్కితే కుటుంబంతో సహా చంపేస్తానని బాధితురాలిని బెదిరించటంతో వారు ఏమీచేయలేక మౌనంగా ఉండి పోయారు. అయితే బాధితురాలు ప్రసవానికి వచ్చి స్థానికంగా ఉన్న ఒక ప్రవేట్‌ వైద్యశాలలో చేరింది. అయితే ముందుగా అంగీకరించని వైద్యశాల నిర్వాహకులు తరువాత చేర్చుకున్నారు. అయితే ఆత్మకూరుకు తరలించినట్లు ప్రకటించారు. అదే వైద్యశాలలో ప్రసవించిన మగబిడ్డను ఫీజుల క్రింద ప్రవేట్‌ వైద్యశాల నిర్వాహకులు జమ చేసుకొని గొల్లపాళెం వీధిలో నివాసం ఉంటున్న ఒక మహిళకు అప్పగించినట్లు తెలుస్తోంది.ఆ మహిళ చెనై్న నగరానికి చెందిన మరొక మహిళకు రూ.20 వేలకు బేరం పెట్టి బాబుని తన దగ్గరే ఉంచుకోగా చెనై్న మహిళ డబ్బుతో వచ్చేసరికి బిడ్డ మృతిచెందింది. ప్రభుత్వ అనుమతులు లేని ప్రవేటు వైద్యశాలలు పిల్లల వ్యాపారాలు చేస్తున్నాకూడా పట్టించుకోవటంలేదని స్థానికులు వాపోతున్నారు. కానీ మృతిచెందిన బిడ్డ బాధితురాలిదా, వేరొకరిదా అనే విషయం గోప్యంగా ఉంచటం విశేషం. మానవ మృగం చేతిలో అత్యాచారానికి గురైన అంధురాలికి అగ్రవర్ణాల నుంచి తీవ్రమైన ఒత్తిడి బెదిరింపులు రావటంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకు వెళ్ళదీస్తున్నారు. ఆదివారం వరకూ పోలీసులకు ఎటువంటీ ఫిర్యాదు లేక పోవటంతో వారు మౌనంగా ఉన్నారు. అజ్ఞాత ంలో అంధురాలి కుటుంబం: కుటుంబాన్ని కాల్చి చంపేస్తాం అని మానవమృగం చేసిన హెచ్చరికలకు భయపడిన బాధితురాలి కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అయితే వారు వరికుంటపాడు మండలంలో తలదాచుకోంటున్నారని అంధురాలైన బాలింతకు ఆరోగ్యం ీ ణించి పరిస్థితి విషమించిందని అంధురాలి కుటుంబసభ్యులు రోధిస్తున్నారు. కనీసం వైద్యానికి కూడా స్థోమత లేని తమకు న్యాయం చేయక పోయినాకూడా కనీసం అమ్మాయి ప్రాణాలు కాపాడాలని బాధితులు కోరుతున్నారు. సోమవారం పోలీసులకు ఫిర్యాదు: బాధితులు ఎట్టకేలకు దైర్యం చేసి బాధితురాలి తండ్రి పెన్నా.మాలకొండయ్య సోమవారం ఉదయం ఉదయగిరి పోలీసు స్టేషన్‌కు చేరుకుని స్థానిక ఎస్‌ఐ రామక్రిష్ణకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు. మరి పోలీసులు ఈ పేదవారికి ఎంత వరకు న్యాయం చేస్తారో వేచిచూడాల్సిందేనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh