online marketing

Monday, February 1, 2010

కళ్ళులేని యువతిపై అత్యాచారం?

ఉదయగిరి, మేజర్‌ న్యూస్‌: మండలంలోని తిరుమలాపురం పంచాయతీలో దుంపవారి పల్లికి చెందిన కళ్ళులేని వికలాంగురాలైన యువతిపై, అదే గ్రామానికి చెందిన ఓ అగ్రకులస్తుడు 7 నెలల కిందట బలవత్కారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి పోతే దుంపవారి పల్లికి చెందిన పెన్నా. మాలకొండయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. భార్య 1983 సంవత్సరంలో చనిపోయినది. ఆమె చనిపోయిన రెండు సంవత్సరాలకు పెద్ద కుమార్తె కూడా చనిపోయింది. అయితే చిన్న కుమార్తె అయిన కొండమ్మకు రెండూ కళ్ళు లేకపోవడంతో అన్నీ తానై తండ్రి వద్దనే ఉంటుంది. కొండయ్య జీవనాధార ం కోసం గ్రామంలోని రైతుల వద్ద పశువుల కాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఒకరోజు తన కుమార్తె కొండమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మానవ మృగం అయిన చిలకల.రమణారెడ్డి అనే కామాంధుడి కంట పడింది. కళ్ళు లేని కబోధి పై కామాంధుని వికృతి చేష్టలకు బలైపోయిందని తండ్రి ఆరోపించాడు. అంతే కాకుండా ఈ కామాంధుడు ఈవిషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో అభాగ్యురాలు ఎవరికీ ఏమి చెప్పుకోలేక పోయిందని బోరున విలపించాడు. కాలక్రమేణా కళ్ళులేని కొండమ్మకు ఆరోగ్యం సహకరించక పోవడంతో మూడు రోజుల కిందట ఉదయగిరిలోని ఒక ప్రవేట్‌ వైద్యశాలలో చూపించగా కొండమ్మ గర్భం దాల్చిందని వైద్యులు తెలిపారన్నారు. దీంతో ఏమిచేయాలో తెలియని తండ్రి లబోదిబో మంటూ ఏడవడంతో వికలాంగురాలైన కొండమ్మ అసలు విషయం బయట పెట్టింది. దీంతో మానవ మృగం అయిన చిలకల.రమణారెడ్డి ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలని కొండమ్మకు గర్భం తీపించాలని లేకపోతే మీ కుటుంబంలోని ముగ్గురిని చంపేస్తానని బెదిరించాడని బాధితురాలి తండ్రి ఆరోపించాడు. బెదిరింపులతో భయపడి తండ్రి ఆత్మకూరుకి గర్భం తీపించేందుకు కొండమ్మను తరలించినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై ఇంత వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh