online marketing

Friday, February 19, 2010

15 లక్షల రూపాయల విలువచేసే

కోవూరు, (మేజర్‌ న్యూస్‌) : కోవూరు సమీపంలోని ఆర్‌కె పెట్రోల్‌బంక్‌ ఎదురుగా జాతీయ రహదారిపై కంటైనర్‌లో అక్రమంగా తరలివెళుతున్న 15లక్షల రూపాయల విలువచేసే రెక్టి ఫైడ్‌ స్పిరిట్‌ను ప్రొహిబిషన్‌, ఎకై్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎస్‌వై ఖురేషి నేతృత్వంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది నిఘావేసి శుక్రవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్‌ టి.ప్రసాద్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కంటైనర్‌లో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రేవా నుంచి కేరళ రాష్ట్రంలోని కొల్లామ్‌కు అక్రమంగా స్పిరిట్‌ తరలివెళుతుందని సమాచారం రావడంతో సిబ్బంది రెండురోజులపాటు నిఘావేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పర్మిట్లలో రేవాలోని తేర్‌మాక్స్‌ ట్రేడ్‌ లిమిటెడ్‌ నుంచి డెకోర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కొల్లామ్‌కు ‘‘వీణా’’ సోప్స్‌ పేరుతో బిల్లులు వ్రాసియున్నట్లు ఆయన తెలిపారు.సిబ్బంది తనిఖీలు నిర్వహించగా కంటైనర్‌లో 35 లీటర్ల క్యాన్లలో స్పిరిట్‌ ను నింపి, అదే సైజులో అట్టపెట్టెలలో పెట్టి రవాణా చేస్తున్నారు. ఈ స్పిరిట్‌ను నాటుసారా తయారీకి ఉపయోగిస్తారని, ఇందులో 97శాతం ఆల్కాహాల్‌ వుంటుందని చాలా ప్రమాదకరమన్నారు. ప్రస్తుతం బ్రాందీషాపులలోని విస్కీ, బ్రాందీలలో ఆల్కాహాల్‌ 42 శాతం వుంటుందన్నారు. పర్మిట్లలో వ్రాసినట్లు కేరళకు కాకుండా తమిళనాడులో స్పిరిట్‌ను చేరవేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో స్మగ్లింగ్‌ చేసేవాళ్ళు ట్యాంకర్ల ద్వారా తరలించేవారని, నిఘా పెరగడంతో ఇలా కంటైనర్లలో ప్యాకింగ్‌ చేసి తరలిస్తున్నారు. అలాగే చండీఘర్‌కు చెందిన ఈ కంటైనర్‌లో సిజి 14 4573, జిజె 6 ఎక్స్‌ 3275 నెంబర్ల ప్లేట్లు, 2సి బుక్‌లు వున్నట్లు కనుగొన్నారు. ఈ కంటైనర్‌లో 433 క్యాన్లు 35 లీటర్లవి వున్నవని, అందులో 15వేల లీటర్ల రెక్టి ఫైడ్‌ స్పిరిట్‌ వుంటుందన్నారు. వీటి ధర 15 లక్షలు, లారీ విలువ 5లక్షలు మొత్తం 20 లక్షల రూపాయలని వీరు అంచనా వేశారు. చంఢీఘర్‌లోని రాయపూర్‌ ప్రాంతానికి చెందిన కంటైనర్‌ డ్రైవర్‌ కులదీప్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కోవూరు ప్రొహిబిషన్‌, ఎకై్సజ్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ స్మగ్లింగ్‌ను నిఘావేసి ఛేదించిన సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా ఎకై్సజ్‌ సూపరిండెంట్‌ ఎస్‌ఎంకెఎమ్‌ బాషా, ఎఇఎస్‌ మురళీధర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఐలు ప్రసాద్‌, నజీర్‌, కోటేశ్వరరావు, విజయ, సరోజిని, ఎస్‌ఐలు పి.విజయకుమార్‌, ఎం.సురేంద్ర, ఎం.వీరాస్వామి, సాయికృష్ణ, కోవూరు ఎకై్సజ్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh