online marketing

Monday, January 18, 2010

కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

బిఎన్‌.కండ్రిగ, మేజర్‌న్యూస్‌ : చిత్తూరు జిల్లా బిఎన్‌ కండ్రిగ మండలంలో సోమవారం రాత్రి గాజులపెళ్ళూరు పంచాయతిలో పరిధిలోని ఆదిలక్ష్మీ గిరిజన కాలనీ సమీపంలో ఒక కారు ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం మేరకు... నెల్లూరు జిల్లా, సుళ్ళూరుపేట పట్టణానికి చెందిన సురేష్‌ (40), బుచ్చినాయుడుకండ్రిగ మండలం, కాటూరు గ్రామానికి చెందిన మునేంద్ర (38)లు కాటూరు గ్రామం నుంచి మోటార్‌సైకిల్‌పై సుళ్ళూరుపేటకు బయలుదేరారు. సురేష్‌ కోడి గుడ్లను అమ్ముకుని జీవించేవాడు. మునేంద్ర కోళ్ళఫారంలో పనిచేసి జీవనం సాగిస్తున్నాడు. ఇరువురూ తిరుపతి నుంచి వచ్చి మునేంద్ర స్వగ్రామం కాటూరుకి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని ఆదిలక్ష్మీగిరిజనకాలనీ మలుపు వద్ద ఎదరుగా వస్తున్న టాటా ఇండికా కారు స్కూటర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేష్‌, మునేంద్రలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ వేణుగోపాల్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh