online marketing

Wednesday, January 20, 2010

కాసుల గలగల - వాహనాల సరసరా


తడ, మేజర్‌ న్యూస్‌ : రాష్ర్త సరిహద్దు తడ మండలం భీములవారిపాళెం ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌లో వాహనాలకు తనిఖీలు కరువవుడంతో అక్రమార్కుల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ప్రభుత్వానికి చెందాల్సిన కోట్లాది రూపాయల పన్నులు అధికారుల జోబుల్లోకి జారుకుంటున్నాయి. దీంతో చెక్‌పోస్టులో పన్నులు రాబడి పూర్తిగా పడిపోయింది. నెల్లూరు జిల్లా అంటేనే అందరికి గుర్తొచ్చేది ధాన్యం. ఇక్కడ ప్రాంతవాసులు పండించే వరికి పొరుగురాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో ప్రభుత్వం ధాన్యాన్ని తరలించకూడదని ఎన్ని ఆంక్షలు జారి చేసినా అధికారుల చేతివాటంతో ధాన్యం స్మగ్లర్లు ప్రతినిత్యం వందల సంఖ్యలో ధాన్యం, బియ్యం లారీలను సరిహద్దు ఎల్లలు దాటిస్తున్నారు.అదేవిధంగా పొరుగు రాష్టమైన తమిళనాడు నుంచి ఎలక్ట్రికల్‌, వంటనూనెలు, స్థానికంగా తయారుచేసే సబ్బులు మన రాష్టానికి భారీ సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. అంతేగాకుండా మన జిల్లాకు ఆనుకొని ఉన్న ప్రకాశం, ఒంగోలు నుంచి గ్రానైటు రాళ్లుకూడా ఈ చెక్‌పోస్ట్‌ మీదుగా తమిళనాడుకు తరలుతుంటాయి. ఇందులో బిల్లులుతో వచ్చేవి పదుల సంఖ్యలో ఉంటే చాటుమాటున వచ్చే వాహనాలు వందల సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా ఇక్కడి చెక్‌పోస్ట్‌లో ఏడు ప్రభుత్వ శాఖాధికారులు తమ సిబ్బందితో 24గంటలు విధిగా వాహనాలు పరిశీలిస్తుంటారు. ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన శాఖలైన వాణిజ్యంతో పాటు రవాణా శాఖ అధికారులకు మామూళ్లు రోజుకు లక్షల్లోనే ముట్టుతాయనేందుకు గతంలో ఏసిబి అధికారులు చేసిన దాడులే ఇందుకు నిదర్శనం. అక్రమార్కులు గుట్టును రట్టుచేసే విజిలెన్స్‌, అవినీతి లంచగొండులను అరికట్టే ఏసిబి శాఖల దృష్టి చెక్‌పోస్ట్‌పై నిరంతరం ఉండడంతో ఇక్కడ పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు తమ ఉనికిని కాపాడుకొనేందుకు స్థానికంగా ఉన్న కొంతమంది వ్యాపారులను ఏజెంట్లుగా నియమించుకొన్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల ద్వార బిల్లులు లేకుండా వెళ్లే వాహనాల యజమానుల నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని ఆ వాహనాలకు తనిఖీలు లేకుండా అటు తమిళనాడుకు, ఇటు మన రాష్టానికి పచ్చజండా ఊపుతున్నారు. అవినితిని అరికట్టేందుకు ప్రభుత్వం 8సంవత్సరాల ్ర తం అధునాతన పరిజ్ఞానంతో 40లక్షల నిధులను వెచ్చించి నిఘా కెమెరాలు ఏర్పాటుచేసింది.కొన్ని రోజులుగా సజావుగా సాగి, అవినీతి తగ్గిపోవడంతో ఆ కెమెరాలను కాస్తా ఎందుకు పనిరాకుండా చేయడంతో అధికారులు విజయం సాధించారనే చెప్పాలి. ఇక్కడ జరుగుతున్న అవినీతిపై దృష్టిసారించి గతంలో సూళ్లూరుపేట డిసిటివోగా పనిచేసిన కిరణ్‌ చౌదరి చెక్‌పోస్ట్‌ నుంచి తరలుతున్న అక్రమ వాహనాలపై దాడులుచేసి పన్నులను వసూలూ చేయడంతో రాష్ట్రంలో ఉన్న అన్ని చెక్‌పోస్ట్‌లకంటే భీవి పాళెం చెక్‌పోస్ట్‌ను ఆదాయంలో ప్రధమ స్ధానంలో నిలిపిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడి చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు 16సార్లుకు పైగా దాడులుచేసి అవినీతి అధికారుల బండారం బయటపెట్టింది. అంతేగాకుండా మూడు సంవత్సరాల క్రితం జిల్లా విజిలెన్స్‌ అధికారులు చెక్‌పోస్ట్‌పై ప్రతేక్య నిఘా పెట్టి 24 గంటలపాటు అక్కడే ఉండి వాహనాలు తనిఖీలు చేపట్టి రెండు లక్షలకుపైగా పన్నుల రూపంలో వసూలు చేసి ఇక్కడి అవినీతిని వే లెత్తిచూపారు. చెక్‌పోస్ట్‌కు దగ్గరలో ఉన్న సూళ్ళూరుపేట టోల్‌ప్లాజా నుంచి వెయ్యిలారీలకు పైగా వాహనాలు వెళ్లుతుంటే ఇక్కడి అధికారుల లెక్కలుమ్రాతం కేవలం నాలుగువందల వాహనాలు మాత్రమే వెళ్లుతున్నాయని రికార్డులు చూపుతున్నారు. విజిలెన్స్‌ చెకింగ్‌ చేసిన తీరు ప్రకారం ఇక్కడ ఆదాయం నెలకు రూ. 60 నుంచి రూ. 80 లక్షలకు పైగా పన్నులు రూపంలో రావలసివుంది. అయితే చెక్‌పోస్ట్‌ అధికారుల లెక్కల ప్రకారం రూ. 25 లక్షలకు మించడంలేదు. మిగిలిన పన్నులు రాబడి ఎవరి జోబుల్లోకి పోతుందో అంతుబట్టడం లేదు. వ్యవహారంపై చెక్‌పోస్ట్‌ అండ్‌ మిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ చింతయ్యను మేజర్‌ న్యూస్‌ వివరణకోరగా కొత్తగా వచ్చిన తనకు ఇక్కడి వ్యవహారాలు పూర్తిగా తెలియవన్నారు. సమైక్యా్రంధా ఉద్యమం, పండుగ వాతావరణం వల్ల వాహనాల రాకపోకలు బాగా తగ్గాయని పేర్కొన్నారు. కాని ఆంధ్రులకు ముఖ్యమైన పండుగగా ఉన్న సంక్రాంతికి వాహనాలు తగ్గాయని స్వయానా అధికారే పేర్కొనండం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అవినీతిపై ఉన్నత స్ధాయి అధికారులు దృష్టిపెడితే ప్రభుత్వ రాబడి భారీ స్ధాయిలో పెరిగి, అవినీతి అధికారుల బాగోతం బయటపడనుంది.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh