online marketing

Friday, January 1, 2010

ముగిసిన ఇంటర్‌ పోటీలు


నెల్లూరు (స్పోర్ట్‌‌స) మేజర్‌న్యూస్‌: నగరంలోని ఎసి.సుబ్బారెడ్డి స్పోర్ట్‌‌స కాంప్లెక్స్‌లో ఈ నెల 29వ తేదీ నుండి జరుగుతున్న జిల్లా ఇంటర్‌ కళాశాలల ఇంటర్‌ కాలేజియేట్‌ 2009-10 పోటీలు గురువారం ముగిశాయి. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలల ప్రిన్సిపాళ్లు స్పోర్ట్‌‌స విశిష్టతను గుర్తించాలన్నారు. తమ తమ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులను ప్రోత్సహించి క్రీడల అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. ఇంటర్‌ విద్యార్థులు క్రీడల్లో పాల్గొని భవిష్యత్‌ జీవితానికి బంగారు బాటలు వేసుకోవాలన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడా పథకం ‘పైకా’ ఇంటర్‌స్థాయి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. క్రమం తప్పకుండా సాధన చేసి క్రీడల్లో జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఇంటర్‌స్థాయి విద్యార్థులకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు. అనంతరం విజేతలకు రోలింగ్‌ షీల్డ్‌లు, మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
విజేతలు జిల్లా ఇంటర్మీడియట్‌ అంతర కళాశాలల పోటీల్లో బాలుర స్పోర్ట్‌‌స చాంపియన్‌లుగా ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ జూనియర్‌ కళాశాల, చిల్లకూరు, బాలికల చాంపియన్‌లుగా జవహర్‌ భారతి జూనియర్‌ కళాశాల, కావలి, బాలుర గేమ్స్‌ చాంపియన్‌షిప్‌ను జవహర్‌భారతి, కావలి, బాలికల చాంపియన్‌షిప్‌ను డికెడబ్ల్యు కళాశాల, నెల్లూరు కైవసం చేసుకున్నాయి. చివరి రోజు జరిగిన పోటీల్లో హ్యాండ్‌బాల్‌ విజేతలుగా ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌జెసి, వాకాడు, రన్నర్స్‌గా జెబి కళాశాల, కావలి, బాల్‌బ్యాడ్మింటన్‌లో విన్నర్స్‌గా జవహర్‌భారతి, కావలి, రన్నర్స్‌గా కెఎసి, నెల్లూరు కళాశాలలు, వాలీబాల్‌లో జవహర్‌భారతి కావలి విన్నర్స్‌గా, జిజెసి విడవలూరు రన్నర్స్‌గా, ఖో-ఖోలో ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌జెసి కోట విద్యార్థులు విన్నర్స్‌గా, జిజెసి విడవలూరు రన్నర్స్‌గా నిలిచారు. బాలికల విభాగంలో బ్యాడ్మింటన్‌ విన్నర్స్‌గా డికెడబ్ల్యు నెల్లూరు, రన్నర్స్‌గా కెఎసి నెల్లూరు. బాస్కెట్‌బాల్‌ విన్నర్స్‌గా జెబి కళాశాల కావలి, రన్నర్స్‌గా విఆర్‌ కళాశాల నెల్లూరు, కబడ్డీ విన్నర్స్‌గా నెల్లూరు డికెడబ్ల్యు కళాశాల, రన్నర్స్‌గా జెబి కళాశాల కావలి, వాలీబాల్‌లో విన్నర్స్‌గా జెబి కళాశాల కావలి, రన్నర్స్‌గా డికెడబ్ల్యు కళాశాల, నెల్లూరు విద్యార్థులు నిలిచారు. ఈ కార్యక్రమంలో పోటీలకు ఆతిధ్యమిచ్చిన కెఎసి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డి.సూర్యనారాయణ, ఎస్‌విజిఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌రెడ్డి, ఎస్‌విజిఎస్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి సిహెచ్‌. రమేష్‌, నిర్వహణ సభ్యులు ఎంవి.రామ్మోహన్‌రావు, నిమ్మల సుబ్బయ్యగౌడ్‌, అధ్యాపకులు ఎన్‌.గోపాలాచారి, జివి.కృష్ణారావు, ఎస్‌విజిఎస్‌.కళాశాల పిడి వేణుగోపాల్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలెంటీర్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh