online marketing

Wednesday, January 6, 2010

బలవన్మరణం...అక్క కోసం ప్రాణాలిచ్చిన తమ్ముళ్లు


కావలి రూరల్‌, మేజర్‌న్యూస్‌: జీవితంపై విరక్తి చెంది తమ సోదరి సుభాషిణి(20) ఆత్మహత్య చేసుకోవడంతో జీర్ణించుకోలేని ఆమె సోదరులు కూడా పురుగు మందు సేవించి మృతి చెందిన సంఘటన మంగళవారం బోగోలు మండలంలోని కోవూరుపల్లి గ్రామంలో జరిగింది. బంధువుల కథనం మేరకు.. గ్రామంలోని మంగమ్మ, రమణయ్యల కుమార్తె సుభాషిణిని ఎఎస్‌పేట మండలం చిరమన గ్రామానికి చెందిన రాంబాబుతో వివాహం చేశారు. తరచూ కుటుంబ తగాదాల కారణంగా సుభాషిణి నాలుగు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు తన పుట్టింటికి వచ్చింది. అనంతరం భార్యభర్తల మధ్య సంబంధాలు లేకుండాపోయాయి. భర్త రాంబాబు ఇటీవల మరో వివాహానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సుభాషిణి మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పూనుకుంది. దీనిని జీర్ణించుకోలేని ఆమె సోదరులు దుర్గా ప్రసాద్‌(18), రాజ్‌కుమార్‌(15)లు ఆమెతో కలిసి పురుగు మందు సేవించారు. సమీపాన ఉన్న చెరువు గట్టుపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని స్థానికులు గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు 108సిబ్బంది బాధితులను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. మంగమ్మ, రమణయ్యలకు నాలుగురు సంతానం కాగా, వారిలో చివరి కుమారుడయిన శివక్రిష్ణ ఒక్కడే మిగిలాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh