online marketing

Friday, January 1, 2010

శాంతి భద్రతలతో వెలుగొందాలి


నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌:జిల్లా ప్రజలు శాంతి భద్రతలతో నూతన సంవత్సరంలోకి అడుగిడి సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఎస్‌పి మల్లారెడ్డి కాంక్షించారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే యువత శాంతి భద్రతలను పాటించాలన్నారు.
పోలీస్‌ డైరీ ఆవిష్కరణనగరంలోని పోలీస్‌గ్రౌండ్‌ నందు ఉన్న ఉమేష్‌చంద్ర అతిధి గృహంలో పోలీస్‌ డైరీని ఎస్‌పి మల్లారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ డైరీని ముద్రించే సంప్రదాయం జిల్లా పోలీస్‌ అధికారుల సంక్షేమ సంఘం వారికే చెల్లుతుందన్నారు. పోలీసుల సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నా వాటిని సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బందిలతోపాటు అధికారుల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డిలతోపాటు సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh