online marketing

Tuesday, December 22, 2009

జనవరిలో ప్రధానిచే బిహెచ్‌ఈఎల్‌ శంఖుస్థాపన:

వెంకటగిరి,మేజర్‌న్యూస్‌:వచ్చే ఏడాది జనవరిలో భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌చే బిహెచ్‌ఈఎల్‌ కర్మాగారం శంకుస్థాపన జరుగుతుందని తిరుపతి ఎంపి డాచింతామోహన్‌ తెలిపారు. ఈమేరకు ఆయన ఢిల్లీ నుండి స్థానిక విలేకరులకు సోమవారం సమాఛారం తెలిపారు. బిహెచ్‌ఈఎల్‌ కర్మాగారాన్ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్ర్తి సమీపంలోని మన్నవరం వద్ద ఏర్పాటుచేస్తున్న ప్రాజెక్టుపై ఢిల్లీలో ప్రధానమంత్రిని కలువగా ఆయన సానుకూలంగా సమాధానమిచ్చారని, జనవరిలో తప్పక శంకుస్థాపన జరుగుతుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా సమైక్యాంధ్ర కోసం రాష్టమ్రంతటా జరుగుతున్న పరిస్ధితులను ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయంపై ఆలోచించి త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామన్నట్లు ఆయన వివరించారు

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh