online marketing

Tuesday, December 22, 2009

మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లులు చెలిస్తాం:డిఇవో

నాయుడుపేట, మేజర్‌న్యూస్‌: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్నం భోజన బిల్లులను మార్చి ఆఖరులోపు చెలిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు తెలిపారు. సోమవారం మండలంలోని నరసారెడ్డి కండ్రిగ పాఠశాలను తనిఖి చేసిన ఆయన ఆపాఠశాలలో మధ్యాహ్న భోజనంలో వివక్ష ఉందన్న విషయం సరికాదన్నారు. అక్కడున్న పిల్లలు, విద్యార్ధుల తల్లిదండ్రులను ఈ విషయమై ప్రశ్నించారు. ఈ సందర్భంగా విలేకర్లుతో మాట్లాడుతూ గత ఏడాదిగా మధ్యాహ్న భోజన పథకంకు నిర్వాహకులకు రూ5కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డిశంబర్‌1నుంచి బిల్లులు కూడా పెంచినట్లు తెలిపారు. అదే విధంగా 25మంది విద్యార్ధులు పై బడిన పాఠశాలలో అదనపు కుక్‌ కోసం రూ1000చెల్లించనున్నట్లు చెప్పారు. ఆయనతో పాటు ఎంఇవో అజయ్‌కుమార్‌, ఎంఆర్‌పిలు శరత్‌, రజనీబాబు తదితరులున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh